News December 3, 2025
రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 5, 2026
GNT: ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్

ఈ నెల 14న జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నీ న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశామని, సివిల్ కేసులు, క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు, చెక్ బౌన్స్, LOAP కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు, స్టేక్హోల్డర్స్, పోలీసులు కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు.
News March 4, 2026
జీజీహెచ్లో మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రభుత్వ వైద్యశాల అధికారులను ఆదేశించారు. జీజీహెచ్ అధికారులతో కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నైట్ షిప్ట్లలో విధులు నిర్వహించే విభాగాల వైద్యులు, క్యాజువాలిటి, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డ్యూటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News March 4, 2026
గుంటూరు జిల్లాలో 5 రేషన్ దుకాణాలపై కేసులు

గుంటూరు జిల్లాలో 5 చౌకధరల దుకాణాల పై కేసులు నమోదు చేసినట్లు JC అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లాలో ఇప్పటికి 244 రేషన్ షాపులను తనిఖీ చేశామని, తనిఖీల్లో సరుకులో వ్యత్యాశం గుర్తించి పెదకాకాని మండలంలో 3, ఫిరంగిపురంలో 1, నల్లచెరువులో 1 షాపు పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కార్డుదారుల నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్న 4 వాహనాలను పట్టుకున్నామన్నారు.


