News December 3, 2025
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

భూపాలపల్లి జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం విద్యార్థులకు అవగాహన సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు రూ.2 వేల కోట్లు సైబర్ మోసాల రూపంలో నష్టం జరుగుతోందన్నారు. దీనికి నివారణ ప్రజల్లో అవగాహన పెంపే ప్రధాన మార్గమని,విద్యార్థులు సైబర్ భద్రతపై తమ కుటుంబాలు, పరిసరాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ సూచన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. బస్టాండ్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, బస్సు పాస్ కౌంటర్లు, బస్సు సీట్లు కేటాయించాలని ఆదేశించారు. దివ్యాంగులతో వ్యవహరించే తీరుపై కూడా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు తగు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
News March 19, 2026
HYD: పిల్లి లేదని అమ్మాయి సూసైడ్

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మీర్పేట్ PSపరిధిలో చోటుచేసుకుంది. బడంగ్పేట్లోని వెంకటాద్రి నివాస్కు హిమబిందు (20) తాను ఎంతో ఇష్టంగా పెంచుకొన్న పెంపుడు పిల్లి మృత్యువాత పడింది. ఇది తట్టుకోలేక పురుగు మందు తాగి హిమబిందు ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News March 19, 2026
HYD: పిల్లి లేదని అమ్మాయి సూసైడ్

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మీర్పేట్ PSపరిధిలో చోటుచేసుకుంది. బడంగ్పేట్లోని వెంకటాద్రి నివాస్కు హిమబిందు (20) తాను ఎంతో ఇష్టంగా పెంచుకొన్న పెంపుడు పిల్లి మృత్యువాత పడింది. ఇది తట్టుకోలేక పురుగు మందు తాగి హిమబిందు ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


