News December 3, 2025

హుస్నాబాద్: రూ.262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

image

హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో రూ.262.38 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.44.12 కోట్లు, R&Bకి రూ.58.91 కోట్లు, ట్రాన్స్ పోర్ట్‌కు రూ.8.5 కోట్లు, ఐటీఐకి రూ.45.15 కోట్లు, R&Bకి రూ.86 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Similar News

News March 16, 2026

ఖమ్మం: నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం

image

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. 2 రోజుల క్రితం ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్య, మూత్రపిండాల్లో క్రియాటినిన్‌ స్థాయి పెరగడం, గతంలో 2 సార్లు గుండెపోటు రావడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్న ఆయనను సోమవారం క్యాజువాలిటీకి తరలించారు.

News March 16, 2026

కామారెడ్డి: DEOకు ఉపాధ్యాయ సంఘాల వినతి

image

నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్‌పల్లి ZPHSలో ఉపాధ్యాయుడిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో DEO రాజుకు వినతిపత్రం అందజేశారు. అలాగే 2025లో SEEP సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు గౌరవ వేతనం చెల్లించాలని, జనగణన-2026లో SGTలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యాల సంతోష్, రాజ్ కుమార్ తదితరులున్నారు.

News March 16, 2026

కలెక్టర్‌ను కలిసిన జిల్లా గ్రంథాలయం ఛైర్మన్

image

జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా మేకపాటి శాంతి కుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు ఆమె పూల బొకే అందజేశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి సహకారం అందించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు.