News December 3, 2025
MBNR: సర్పంచ్ కోసం.. రూ.లక్షల్లో ఖర్చు

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓట్ల వేటలో స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. కొందరు భూములు, బంగారం సైతం తాకట్టు పెడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చిన్న చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ.నాలుగైదు లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. మామూలు పంచాయతీలో రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల దాకా.. పెద్ద పంచాయతీల్లో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. SHARE IT.
Similar News
News March 23, 2026
యుద్ధం.. సామాన్యుడిపై భారం పడకుండా మోదీ ప్లాన్!

యుద్ధం కారణంగా ఎరువులు, ఇంధనం, నిత్యావసర వస్తువుల కొరత రాకుండా మోదీ అధికారులను అలర్ట్ చేశారు. ఖరీఫ్ కోసం ఎరువుల నిల్వలు పెంచాలని, విద్యుత్ కొరత రాకుండా బొగ్గు సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫార్మా, కెమికల్ రంగాలకు కావాల్సిన ముడి పదార్థాల కోసం ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయాలను వెతకాలని సూచించారు. మంత్రులు, కార్యదర్శులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.
News March 23, 2026
కట్టంగూరు: స్విమ్మింగ్ పూల్లో మాజీ సైనికుడి మృతి

కట్టంగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బెల్లి జనార్ధన్ (50) ఆదివారం సాయంత్రం కట్టంగూరులోని ఒక స్విమ్మింగ్ పూల్కు ఈతకు వెళ్లారు. నీటిలో ఈత కొడుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News March 23, 2026
ఇందూరులో ‘డబుల్’ చుట్టే రాజకీయం..!

నిజామాబాద్ అర్బన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వేలాది మంది పేదలు దరఖాస్తు చేసుకున్నా, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిర్మాణం పూర్తైన ఇళ్లను వెంటనే కేటాయించాలని ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అటు అధికార పక్షం పారదర్శకంగానే ప్రక్రియ సాగుతోందని చెబుతుండగా, క్షేత్రస్థాయిలో అసలైన అర్హులెవరో తేల్చడం అధికారులకు సవాలుగా మారింది.


