News December 3, 2025
‘డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు వక్రీకరించవద్దు’

రాజోలు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి చెట్లు పోతున్నట్టు వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ను విమర్శించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దని ఆ ప్రకటనలో పార్టీ కోరింది.
Similar News
News March 21, 2026
తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది: బండి సంజయ్

తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇది ప్రజలను వంచించే బడ్జెట్ అని, అంకెల ఆర్భాటాలు తప్ప ఒరిగేదేమీ లేదని మీడియాతో అన్నారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేశారని ఫైరయ్యారు. ‘డ్రగ్స్ కేసులో సీఎంకు చిత్తశుద్ధి లేదు. ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే’ అని ఆరోపించారు.
News March 21, 2026
నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం

నెల్లూరు జిల్లాలో వరి పంట చేతికోస్తుంది. ఈక్రమంలో అకాల వర్షాలు రైతులను ముంచేసింది. అనంతసాగరం, కలవాయి,రాపూరు, మర్రిపాడు మండలాల పరిధిలో ఇటీవల వర్షం కురిసింది. దీంతో 19 గ్రామాల పరిధిలో వరి 1157 హెక్టర్లు, పత్తి 140 హెక్టర్లలో మొత్తంగా 1297 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు.
News March 21, 2026
సంగారెడ్డి: రోగుల వివరాలు ఇక డిజిటల్ రూపంలో..

రోగుల పూర్తి వైద్య వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో జరిగిన శిక్షణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టు కింద జోగిపేట, పటాన్చెరు, సదాశివపేట ఏరియా ఆసుపత్రులతో పాటు 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల డిజిటల్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని తెలిపారు.


