News December 3, 2025

నేడు హుస్నాబాద్‌లో సీఎం పర్యటన

image

ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, ఏటీసీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు, మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News March 7, 2026

‘విజయ’ బ్రాండ్‌తో కల్తీ.. AP డెయిరీపై ఆరోపణలు

image

TG: AP విజయ డెయిరీ తీరుపై తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అమిత్ రెడ్డి మండిపడ్డారు. అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి వస్తున్నాయని ఆరోపించారు. మేఘనా ఫుడ్స్ తయారు చేస్తున్న నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు. దీనివల్ల తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. AP ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

News March 7, 2026

SRPT: టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక మోటివేషన్ సెషన్: డీఈఓ అశోక్

image

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఈనెల 9న ఉదయం 10:30 నుంచి ప్రత్యేక మోటివేషన్ సెషన్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. టీ-శాట్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రాణా సూచనలు చేస్తారు. పాఠశాలల్లోని ఐఎఫ్పీల ద్వారా విద్యార్థులందరూ ఈ సెషన్‌ను వీక్షించేలా ప్రధానోపాధ్యాయులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.

News March 7, 2026

WGL: రంజాన్.. మసీదులకు లైటింగ్ ఏర్పాటు

image

రంజాన్ పర్వదినం సందర్భంగా మసీదులకు లైటింగ్ ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం GWMC సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ పాల్గొని ముస్లింలకు ఇబ్బందులు కలగకుండా బల్దియా ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. డివిజన్లలో దెబ్బతిన్న లైట్లను పునరుద్ధరించడంతో పాటు ఎన్పీడీసీఎల్ వారి సమన్వయంతో వీధి దీపాలు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు.