News December 3, 2025
MDK: ఎవరికి వారే.. ఏకాభిప్రాయ సాధనకు బుజ్జగింపులు

పంచాయతీ ఎన్నికలు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీ మద్దతుదారులు ఎవరికి వారే బరిలో దిగడంతో ఏకాభిప్రాయం కోసం నేతలు తంటాలు పడుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో విపరీతమైన పోటీ నెలకొనడంతో సర్దుబాటు చేయలేక పార్టీ నాయకులు తలలు పట్టుకున్నట్టు తెలుస్తుంది. మెదక్ జిల్లాలో 492 జీపీలు, సంగారెడ్డిలో 613 జీపీలు, సిద్దిపేట జిల్లాలోని 508 జీపీలతో పాటు వార్డులకు 11,14,17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News March 6, 2026
సంక్షేమమే లక్ష్యంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్: మంత్రి పొన్నం

పారదర్శక పాలనతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రతి వారం ఒక నిర్దిష్ట రంగంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
News March 6, 2026
సుఖోయ్ క్రాష్.. ఇద్దరు పైలట్లు మృతి

అస్సాంలో నిన్న సుఖోయ్ <<19308614>>యుద్ధ విమానం<<>> క్రాష్ అయిన విషయం తెలిసిందే. అందులో ఉన్న పైలట్లు అనుజ్, పుర్వేష్ దురగ్ఖర్ చనిపోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. నిన్న రాత్రి సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గాల్లోకి ఎగిరిన కాసేపటికే 7.42pmకు రాడార్ నుంచి ఫైటర్ జెట్ కాంటాక్ట్ కోల్పోయినట్లు IAF తెలిపింది.
News March 6, 2026
మార్కాపురం జిల్లా వైద్యశాలలో వేధిస్తున్న డాక్టర్ల కొరత

మార్కాపురం జిల్లా వైద్యశాలలో డాక్టర్లు, వైద్య పరికరాలు, సరైన యంత్రాలు లేక పేషెంట్లకు వైద్యం అందడం లేదు. ఎర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాలలో పేషెంట్లను ఎమర్జెన్సీ వైద్య సదుపాయం కోసం జిల్లా వైద్యశాలకు డాక్టర్లు రిఫర్ చేస్తారు. ఇక్కడ సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో ఒంగోలు రిమ్స్కు రిఫర్ చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా జిల్లా వైద్యశాలలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించాలని పేషెంట్లు కోరుతున్నారు.


