News December 3, 2025
MDK: ఓటర్లను ప్రలోభపెట్టేవారిపై కఠిన చర్యలు: ఎస్పీ

గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, విభేదాలకు దూరంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కొందరిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. నగదు, మద్యం పంపిణీపై కఠిన నిఘా ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు పెట్టవద్దని, యువత కేసుల్లో ఇరుక్కోకూడదని సూచించారు.
Similar News
News April 2, 2026
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామసభలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సక్రమంగా తీర్మానాలు చేయాలని అధికారులకు సూచించారు.
News April 2, 2026
మెదక్: ‘మీ సేవ’ ఛార్జీల పెంపు: అదనపు కలెక్టర్

‘మీ సేవ’ కేంద్రాల ఛార్జీలు పెంచినట్లు మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. కనీస ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి పెరిగిందని, A కేటగిరీకి రూ.62, B కేటగిరీ సేవలకు రూ.80గా నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై మీసేవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3వ తేదీన మెయింటెనెన్స్ డే కారణంగా కేంద్రాలు పనిచేయవన్నారు.
News April 2, 2026
మనోహరాబాద్: సబ్బుపై హనుమాన్ రూపం

హనుమాన్ జయంతి సందర్భంగా చిత్రకారుడు సబ్బుపై హనుమాన్ చిత్రం చెక్కారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్ర లేఖనం ఉపాధ్యాయుడు బ్రహ్మచారి సబ్బుపై వీర హనుమాన్ రూపాన్ని చెక్కి తన భక్తిని చాటుకున్నారు. చిత్ర లేఖనంతో విద్యార్థుల భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఉపాధ్యాయుడిని పలువురు అభినందించారు.


