News December 3, 2025
కాణిపాకం సేవలు ఇక ఆన్ లైన్ లోనూ…

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సేవలు ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చాయి. దర్శన టికెట్ల బుకింగ్, ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఆన్ లైన్ సేవలకు దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. బుకింగ్ కోసం ఆలయ అధికార వెబ్సైట్ల ద్వారా సేవలు పొందవచ్చు. లేదా ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు.
Similar News
News March 22, 2026
సొంత భూమికి సొమ్ము దక్కకనే వృద్ధుడి ఆత్మహత్య: ఎస్ఐ

భూమి అమ్మిన డబ్బులు ఇవ్వకుండా కొనుగోలుదారులు బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన <<19446112>>వృద్ధుడు<<>> ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎర్రుపాలెం SI రమేష్ తెలిపారు. బనిగండ్లపాడుకు చెందిన యన్నం వెంకటరామిరెడ్డి(70) తనకు ఉన్న 3గుంటల ఖాళీ స్థలాన్ని ముగ్గురికి విక్రయించారు. వారు కొంత నగదు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగిలిన డబ్బుల కోసం వారిని అడగగా, భయభ్రాంతులకు గురిచేశారని ఎస్ఐ అన్నారు.
News March 22, 2026
రేపు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 23న విశాఖ రానున్నారు. 23న మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
News March 22, 2026
రొటీన్కు భిన్నంగా రేవంత్ ప్రసంగం

నర్మెట్ట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శైలికి భిన్నంగా రాజకీయ విమర్శల కంటే అభివృద్ధికే పెద్దపీట వేశారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తున్నామని చెప్తూ ప్రతిపక్ష నేతల(కేసీఆర్, KTR, హరీశ్)పై వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉన్నారు. తన పాలనలో కక్షసాధింపు చర్యలు ఉండవని, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.


