News April 18, 2024
ఒంగోలు పార్లమెంట్కు నామినేషన్ వేసిన క్రాంతి కుమార్

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఒంగోలు పార్లమెంట్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొడ్డు క్రాంతి కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈమేరకు కలెక్టర్ ఆ పత్రాలను పరిశీలించి ఆఫిడవిట్ అందజేశారు.
Similar News
News April 22, 2025
యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

యానాదుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో యానాది సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రిమిటివ్ ట్రైబల్ జాబితాలో తమను చేర్చాలని కోరారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో యానాది సామాజిక వర్గానికి ప్రాధాన్యతివ్వాలని వినతిపత్రం అందజేశారు.
News April 22, 2025
యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

యానాదుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో యానాది సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రిమిటివ్ ట్రైబల్ జాబితాలో తమను చేర్చాలని కోరారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో యానాది సామాజిక వర్గానికి ప్రాధాన్యతివ్వాలని వినతిపత్రం అందజేశారు.
News April 22, 2025
కేవీపీఎస్ సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ

కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఆవిష్కరించారు. కేవీపీఎస్ సామాజిక సాంస్కృతిక ఉత్సవాలు-2025లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జీవిత చరిత్రపై ఒంగోలు అంబేడ్కర్ భవనంలో మే 8న, అలాగే మద్దిపాడులోని నటరాజ్ కళాక్షేత్రంలో మే 9న నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. కలెక్టర్ పాల్గొని తిలకించాలని ఆహ్వానించారు.