News December 3, 2025
టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. అభ్యర్థులు రూ.600 అదనపు రుసుము చెల్లించి అడ్మిషన్ పొందవచ్చన్నారు. ముఖ్యంగా పాత సిలబస్లో పదో తరగతి ఫెయిల్ అయిన వారికి ఇది మంచి అవకాశమని ఆమె పేర్కొన్నారు.
Similar News
News March 21, 2026
బడ్జెట్లో మైక్రో SUV.. సరికొత్తగా ఎక్స్టర్

మధ్యతరగతి ఫ్యామిలీలే టార్గెట్గా మార్కెట్లోకి హ్యుందాయ్ సరికొత్త ఎక్స్టర్ను తీసుకొచ్చింది. ఈ మైక్రో SUV ప్రారంభ ధరను రూ.5,79,000(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. పాత మోడల్తో పోలిస్తే కాస్త డిజైన్ ఛేంజెస్ చేసింది. తొలిసారి డ్యాష్క్యామ్ ఫీచర్ తీసుకొచ్చింది. స్పోర్టీ డీ-కట్ స్టీరింగ్ వీల్, లాంగ్ వీల్బేస్, 4 సిలిండర్ 1.2 కప్పా పెట్రోల్ ఇంజిన్ సహా 25రకాల మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.
News March 21, 2026
నిర్మల్: విద్యార్థిని తేజస్విని మృతి.. కారణం ఇదే

బాసర RGUKT విద్యార్థిని తేజస్విని మృతికి ‘అక్యూట్ లుకేమియా బ్లాస్ట్ సెల్’ (బ్లడ్ క్యాన్సర్ – 4వ స్టేజి) కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు నిజామాబాద్, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. అయితే అప్పటికే క్యాన్సర్ చివరి దశకు చేరుకోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వర్సిటీ అధికారులు విచారం వ్యక్తం చేశారు.
News March 21, 2026
జనగామ: కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. చిగురిస్తున్న ఆశలు!

గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి నాలుగేళ్లుగా పింఛన్లు రాక నానా అవస్థలు పడ్డారు. జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు ఇప్పించండి మహాప్రభో అని ప్రజావాణిలో వేడుకున్నారు. ఎట్టకేలకు శుక్రవారం శాసనసభలో భట్టి విక్రమార్క కొత్త పింఛన్లకు బడ్జెట్ కేటాయించడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జనగామ జిల్లాలో సుమారుగా 10 వేల కొత్త పింఛన్లు రావాల్సి ఉంది.


