News December 3, 2025

కొబ్బరి రైతులకు ‘సీఎఫ్‌సీ’ వరం.. రూ. 2.24 కోట్లు మంజూరు

image

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులు, అనుబంధ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. కొబ్బరి క్లస్టర్ పరిధిలో అత్యాధునిక కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.29.97 కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర వాటా కింద ఉన్న రూ. 4.49 కోట్లలో, తొలి విడతగా సగం నిధులు, అంటే రూ. 2.24 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Similar News

News March 19, 2026

తణుకు: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

image

తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్‌ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్‌ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

News March 19, 2026

భీమవరం: ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

image

భీమవరంలోని కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఈమని సోమయాజులు ఘనాపాటి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, మహా ఆశీర్వచనం, కవి సమ్మేళనం ఉంటాయని పేర్కొన్నారు. ఇదే వేదికపై ప్రముఖ కవులు తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి, డాక్టర్ గొర్తి వెంకట సుబ్రహ్మణ్యం శర్మ, డాక్టర్ పెంకి విజయ్ కుమార్లను ఘనంగా సత్కరించనున్నట్లు ఆమె వెల్లడించారు.

News March 19, 2026

భీమవరం: ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

image

భీమవరంలోని కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఈమని సోమయాజులు ఘనాపాటి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, మహా ఆశీర్వచనం, కవి సమ్మేళనం ఉంటాయని పేర్కొన్నారు. ఇదే వేదికపై ప్రముఖ కవులు తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి, డాక్టర్ గొర్తి వెంకట సుబ్రహ్మణ్యం శర్మ, డాక్టర్ పెంకి విజయ్ కుమార్లను ఘనంగా సత్కరించనున్నట్లు ఆమె వెల్లడించారు.