News December 3, 2025
ఎచ్చెర్ల: మహిళ హత్య?

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలన జరుపుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 27, 2026
శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అధికారులు

కిల్లిపాలేం గ్రామ సచివాలయంలో పని చేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ హేమ రాగిణి శాలరీ ఏరియర్స్ బిల్లులు నిలిచిపోయాయి. ఈ బిల్లలు చెల్లించాలని ఇటీవల ఆమె శ్రీకాకుళంలోని సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లగా ట్రెజరీ ఆఫీసర్ రవి ప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాసరావులు రూ.15 వేలు డిమాండ్ చేశారు. ఆమె ఏసీబీ అధికారులను సంప్రదించగా..ఇవాళ సదరు డిజిటల్ అసిస్టెంట్ నుంచి అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు.
News January 27, 2026
పలాస: కుటుంబ కలహాలతో యువకుడి హంగామా

పలాస కేటీ రోడ్డు ఇందిరా చౌక్ వద్ద నడిరోడ్డుపై మంగళవారం ఉదయం <<18971917>>మద్యం మత్తులో ఓ యువకుడు<<>> తన చేయిని కోసుకొని వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశ్నించిన వాహనదారులపై దాడికి యత్నించి భయాభ్రాంతులకు గురి చేశాడు. దీంతో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పలాస రాజాం కాలనీలో నివాసం ఉంటున్న తిరుపతి రావు కుటుంబ కలహాలతో ఈ ఘటనకు పాల్పడినట్లు కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.
News January 27, 2026
శ్రీకాకుళం: యాక్సిడెంట్.. రైస్ మిల్లర్ మృతి

నరసన్నపేటకు చెందిన రైస్ మిల్లర్ వెంకటరమణ (67) విశాఖపట్నం మద్దిలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం ఉదయం తన కుమార్తె ఇంటి వద్ద నుంచి మార్కెట్కు స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


