News December 3, 2025

వీబీఆర్ పరిశీలనకు వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్సీలు

image

ఏపీ శాసనమండలి ఎమ్మెల్సీలు రామచంద్రా రెడ్డి, కవురు శ్రీనివాస్ నంద్యాలలో జరగనున్న ఏపీ శాసన పరిషత్ హామీల కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు బుధవారం నంద్యాల వచ్చారు. వారికి కమిటీ ఛైర్మన్, స్థానిక నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా స్వాగతం పలికారు. ముందుగా వారు పరిశీలనలో భాగంగా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిశీలించేందుకు వెళ్లారు. రేపు కలెక్టర్ కార్యాలయంలో కమిటీ సమావేశం జరగనుంది.

Similar News

News December 3, 2025

వార్షిక ఆదాయ లక్ష్యాలను అధిగమించండి: కలెక్టర్

image

జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా విభాగాలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలను 100% అధిగమించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో వనరుల వినియోగం, పర్యవేక్షణ, లక్ష్య సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News December 3, 2025

GHMCలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం

image

TG: గ్రేటర్ హైదరాబాద్‌లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ORR వరకు, దానికి అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను GHMCలో విలీనం చేయాలని ఇటీవల ప్రభుత్వం క్యాబినెట్‌లో నిర్ణయించింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ విలీనం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.

News December 3, 2025

అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం: సీఎం రేవంత్ రెడ్డి

image

కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని సీఎం రేవంత్ రెడ్డి ఏద్దేవా చేశారు. బుధవారం హుస్నాబాద్ ప్రజా పాలన సభలో మాట్లాడుతూ లక్ష కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయే ప్రాజెక్ట్ కట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులతోనే నేటికీ తెలంగాణ ప్రజలకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ వైఫల్యమైందని విమర్శించారు.