News December 3, 2025
ఎన్నికల ప్రచార ఖర్చు పకడ్బందీగా నమోదు చేయాలి: పరిశీలకులు

ఎన్నికల ప్రచార ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచార ఖర్చు వివరాలను మూడు సార్లు ఎన్నికల పరిశీలకుల ముందు తప్పనిసరిగా హాజరై చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రచార సర్వేను పరిశీలకులు పూర్తిగా పర్యవేక్షించాలని సూచించారు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: మొదటి విడత ఎన్నికకు 1,740 పోలింగ్ కేంద్రాలు

మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 4, 2025
జగిత్యాల జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత కాస్త తగ్గింది. గత రెండు రోజులు జిల్లాను వణికించిన అత్యల్ప ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గత రాత్రి చలి తక్కువగా ఉండడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేరెళ్ల, ఐలాపూర్లో 14.6℃, రాఘవపేట 14.7, రాయికల్, సారంగాపూర్ 14.8, మన్నెగూడెం 14.9, కథలాపూర్, జగ్గాసాగర్, పొలాసలో 15°Cగా నమోదైంది. మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత అంతంతమాత్రంగానే ఉంది.
News December 4, 2025
ధాన్యం రక్షణకు 5,228 టార్పాలిన్లు సిద్ధం: జేసీ

కోనసీమ జిల్లాలో అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు 204 కొనుగోలు కేంద్రాల సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో 5,228 టార్పాలిన్ షీట్లను అందుబాటులో ఉంచామని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. రైతులు ఈ షీట్లను ఉచితంగా వినియోగించుకుని, తమ పంట ధాన్యాన్ని రక్షించుకోవాలని, అనంతరం వాటిని తిరిగి అందించాలని ఆమె కోరారు.


