News December 4, 2025

వర్ధన్నపేట ఇన్‌ఛార్జి.. ఎర్రబెల్లి VS దాస్యం

image

బీఆర్‌ఎస్‌ పార్టీ కష్టాల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు – దాస్యం వినయభాస్కర్‌ వర్గాల మధ్య విభేదాలు కలకలం రేపుతున్నాయి. ఇన్‌ఛార్జి బాధ్యతలపై ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు బహిరంగమైంది. హసన్‌పర్తి, ఐనవోలు మండలాలపై హస్తక్షేపం విషయంలో నెలకొన్న అసంతృప్తి కారణంగా, జీపీ ఎన్నికల్లో పార్టీ సమన్వయంపై కేడర్‌లో ఆందోళన నెలకొంది.

Similar News

News December 4, 2025

ఖమ్మం: మొదటి విడత ఎన్నికకు 1,740 పోలింగ్ కేంద్రాలు

image

మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News December 4, 2025

జగిత్యాల జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత కాస్త తగ్గింది. గత రెండు రోజులు జిల్లాను వణికించిన అత్యల్ప ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గత రాత్రి చలి తక్కువగా ఉండడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేరెళ్ల, ఐలాపూర్లో 14.6℃, రాఘవపేట 14.7, రాయికల్, సారంగాపూర్ 14.8, మన్నెగూడెం 14.9, కథలాపూర్, జగ్గాసాగర్, పొలాసలో 15°Cగా నమోదైంది. మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత అంతంతమాత్రంగానే ఉంది.

News December 4, 2025

ధాన్యం రక్షణకు 5,228 టార్పాలిన్‌లు సిద్ధం: జేసీ

image

కోనసీమ జిల్లాలో అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు 204 కొనుగోలు కేంద్రాల సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో 5,228 టార్పాలిన్ షీట్లను అందుబాటులో ఉంచామని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. రైతులు ఈ షీట్లను ఉచితంగా వినియోగించుకుని, తమ పంట ధాన్యాన్ని రక్షించుకోవాలని, అనంతరం వాటిని తిరిగి అందించాలని ఆమె కోరారు.