News April 19, 2024
నాగర్ కర్నూల్ BSP అభ్యర్థిగా మంద పోటీచేస్తే ఎవరికి నష్టం..?
మాజీ ఎంపీ మంద జగన్నాథం బీఎస్పీలో చేరారు. ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఎస్పీ నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే రాజకీయంగా ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో మొలైంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సామాజికవర్గం ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మీ కామెంట్..
Similar News
News October 1, 2024
MBNR: సర్వం సిద్ధం.. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన
డీఎస్సీ పలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మెరుగైన ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్స్ పరిశీలన నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, ఎంపికైన అభ్యర్ధుల ఫోన్ కు SMS/మెయిల్ ఐడీకి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని, 1:3 నిష్పత్తిలో DEOల వెబ్ సైట్ లో ఉంచుతామని డీఈవోలు తెలిపారు.
News October 1, 2024
“దేవద్రోణి తీర్థం” పుష్కరఘాట్లో ఘాతుక చతుర్దశి !
అలంపూర్ పుణ్యక్షేత్రం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న “దేవద్రోణి తీర్థం”లో మంగళవారం ఘాతుక చతుర్దశి చేస్తారు. మహాలయపక్షాల సందర్భంగా దేవద్రోణి తీర్థమైన పుష్కరఘాట్ లో ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని ఈ ప్రాంతవాసుల విశ్వాసం. సాధారణ మరణాలు కాకుండా బలవన్మరణాలు, అకాల(యాక్సిడెంట్) మరణాలతో మృతి చెందిన వారికి వారి సంతానం ఈ ప్రాంతంలో తిలా తర్పనాలు, శ్రాధ్ద ఖర్మలు చేస్తారు.
News October 1, 2024
MBNR: దసరాకు 649 RTC ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 10 డిపోల నుంచి 649 RTC ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. నేటి నుంచి ఈనెల 11 వరకు అదనపు సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ RM వి. శ్రీదేవి తెలిపారు. గద్వాల డిపోలో 89, కల్వకుర్తి-డిపో 67, కొల్లాపూర్ 58, MBNR 69, NGKL 53, నారాయణపేట 54, షాద్నగర్ 59, వనపర్తి 95.. అత్యధికంగా అచ్చంపేట డిపో 105 బస్సులు నడపనున్నారు. ఏపీకి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు.