News April 19, 2024
మరోసారి గెలిస్తే రెండేళ్లలో నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా

ప్రధాని మోదీని మరోసారి గెలిపిస్తే దేశంలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ‘అధికారంలోకి వచ్చిన ఏడాది లేదా రెండేళ్లలోనే నక్సలిజాన్ని అంతం చేస్తాం. ఛత్తీస్గఢ్లో BJP సర్కార్ రాగానే 90 రోజుల్లోనే 86 మంది నక్సల్స్ హతమయ్యారు. 126 మంది అరెస్ట్ కాగా 250 మంది సరెండర్ అయ్యారు’ అని తెలిపారు. కాంకేర్ ఎన్కౌంటర్లో 29 మంది మావోలు హతమైన నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News December 27, 2025
మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి: రేవంత్

TG: జనవరి 5 నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం బచావో కార్యక్రమం చేపట్టాలని CWC సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. పలు ప్రయోజనాలతో తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు Xలో రాసుకొచ్చారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఈ పథకాన్ని కాపాడుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
News December 27, 2025
అల్లు అర్జున్ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటనపై పోలీసులు <<18684964>>ఛార్జ్షీట్<<>> దాఖలు చేయడంపై మరోసారి హీరో అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను ఏ-11గా పేర్కొనడంతో బన్నీని మళ్లీ అరెస్ట్ చేస్తారా? అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఛార్జ్షీట్ అనేది కేసు పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించే నివేదిక. ఇక్కడ సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు అందులో పేర్కొనడంతో బన్నీ అరెస్ట్ ఉండకపోవచ్చు!
News December 27, 2025
రాష్ట్రంలోనే ‘ఉపాధి’ పథకం ప్రారంభం.. CWCలో చర్చ

AP: MGNREGA స్కీమ్ ఏర్పాటై 2026 ఫిబ్రవరి 2కు 20 ఏళ్లు పూర్తి అవుతుంది. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నాటి PM మన్మోహన్, సోనియా దాన్ని ప్రారంభించారు. కాగా NDA ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై వివాదం మొదలైంది. దీనిపై CWC భేటీలో చర్చించినట్లు PCC EX చీఫ్ రుద్రరాజు తెలిపారు. JAN 5 నుంచి చేపట్టే ఉద్యమంలో భాగంగా బండ్లపల్లిలో సభ నిర్వహించాలని, దీనికి రావాలని సోనియాను కోరామని తెలిపారు.


