News April 19, 2024
24 గంటలు అందుబాటులో ఉండేలా పోలీసు హెల్ప్ లైన్ నంబర్స్

24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా ఎన్నికలకు పోలీసు హెల్ప్ లైన్ నంబర్స్- 9440796385, 9392903413, 0861-2328400 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ
K.ఆరీఫ్ హఫీజ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగపరంగా కల్పించబడిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసిందన్నారు .
Similar News
News October 9, 2025
కనుపూరు కాలువలో పడి చార్టెడ్ అకౌంటెంట్ మృతి

వెంకటాచల మండలం కసుమూరు కాలువలో పడి అల్లూరు శ్రీకాంత్(30) మృతి చెందినట్లు బుధవారం రాత్రి పోలీసులు తెలిపారు. విడవలూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ కసుమూరులో అత్తగారింటికి భార్య శిరీషతో కలిసి వచ్చాడు. బహిర్భూమికి పోయి ప్రమాదవశాత్తు కనుపూరు కాలువలో పడి చనిపోయాడు. ఇతను CAగా చెన్నైలో పనిచేస్తున్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 9, 2025
టపాసుల గోదాములపై తనిఖీలు చేపట్టండి: కలెక్టర్

రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం లైసెన్సు పొందినవారే బాణసంచా తయారీ, నిల్వలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
News October 9, 2025
10న వెంకటాచలం రానున్న CM..

CM చంద్రబాబు ఈ నెల 10న వెంకటాచలం మండలంలో పర్యటించనున్నారు. ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఏర్పాట్లను పరిశీలించారు. సర్వేపల్లి బిట్ 2 గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం, నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల, విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ పరిసరాలను వారు ముమ్మరంగా తనిఖీ చేశారు.