News April 19, 2024
బోర్డర్ దాటి భవితవ్యం తేల్చుకుంటారు! – 2/2

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఆ భూభాగానికి ఆంక్షలు, వివాదాలు లేకపోవడంతో 15 కుటుంబాలు అక్కడ నివసించగలుగుతున్నాయి. ‘సొంతగడ్డకు దూరంగా ఉన్నామనే భావన కలుగుతోంది. చీకటి పడితే బంగ్లాదేశ్ జవాన్లు, కొందరు మూకల దయాదాక్షిణ్యాలపైనే బతకాల్సి వస్తోంది’ అని వాపోతున్నారు. బోర్డర్ దగ్గర రాకపోకలు సాగించడంలో ఎదురయ్యే సమస్యలు ఈ ఎన్నికల తర్వాత అయినా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News November 9, 2025
అద్వానీకీ అదే న్యాయం వర్తిస్తుంది: శశిథరూర్

BJP నేత అద్వానీపై కాంగ్రెస్ MP శశిథరూర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక్క ఘటనను కారణంగా చూపించి ఆయన చేసిన సుదీర్ఘ సేవను తగ్గించడం అన్యాయం. చైనా ఎదురుదెబ్బను చూపించి నెహ్రూ కెరీర్ను, ఎమర్జెన్సీ ఆధారంగా ఇందిరా గాంధీ రాజకీయ జీవితాన్ని నిర్వచించలేం. అద్వానీకీ అదే న్యాయం వర్తిస్తుంది’ అని తెలిపారు. విద్వేషపు విత్తనాలు నాటడం సేవ కాదని అద్వానీపై అడ్వకేట్ సంజయ్ హెగ్డే చేసిన ట్వీట్కు ఇలా బదులిచ్చారు.
News November 9, 2025
నైట్ పార్టీల్లో ఇలా మెరిసిపోండి

పార్టీల్లో అందంగా కనిపించాలంటే మేకప్ తప్పనిసరి. అయితే నైట్ పార్టీల్లో న్యూడ్ కలర్స్ కంటే ముదురురంగు లిప్స్టిక్ బావుంటుంది. ప్లెయిన్ ఐ షాడోకి గ్లిట్టర్ యాడ్ చెయ్యాలి. కాంపాక్ట్ పౌడర్ లైట్గా అద్దుకోవాలి. బ్రాంజర్తో కాంటూర్, చెక్కిళ్లకు బ్లషర్ అద్దాలి. ఫాల్స్ ఐ లాషెస్ లేదా డ్రమాటిక్ మస్కారా యాడ్ చెయ్యాలి. హైలైటర్ను చెక్కిళ్లు, బ్రో బోన్ మీద అద్దుకుంటే పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు.
News November 9, 2025
CII సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి కొండపల్లి

AP: రాష్ట్రాన్ని మాన్యూఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో MSME ఎగుమతుల అభివృద్ధి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘IT రంగంలోనూ విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. MSME విభాగంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. CII సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఏపీపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది’ అని పేర్కొన్నారు.


