News December 5, 2025
జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!
Similar News
News March 17, 2026
ఒంగోలు: బస్సు ప్రయాణంలో రూ.9 లక్షల బంగారం చోరీ.. చివరికి.!

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో దొంగిలించిన 120 గ్రాముల బంగారం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన బోయిన హిమబిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు నిందితులను గుర్తించారు. రూ.9 లక్షల విలువైన బంగారం రికవరీ చేసి SP హర్షవర్ధన్ రాజు బాధితురాలికి అందజేశారు.
News March 17, 2026
ప్రకాశం SP పరిష్కార వేదికకు 95 అర్జీలు

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన లభించినట్లు SP కార్యాలయం పేర్కొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదారులు పెద్ద ఎత్తున వేదికకు వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 95 అర్జీలను SP హర్షవర్ధన్ రాజు సోమవారం స్వీకరించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయం అందించేందుకు సంబంధిత అధికారులకు సూచించారు.
News March 17, 2026
ప్రకాశం SP పరిష్కార వేదికకు 95 అర్జీలు

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన లభించినట్లు SP కార్యాలయం పేర్కొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదారులు పెద్ద ఎత్తున వేదికకు వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 95 అర్జీలను SP హర్షవర్ధన్ రాజు సోమవారం స్వీకరించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయం అందించేందుకు సంబంధిత అధికారులకు సూచించారు.


