News December 5, 2025

రంప: పాఠశాలలో ఆడుకుంటు..కుప్పకూలిన విద్యార్థిని

image

రంపచోడవరం మండలం తామరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థిని కె. జానుశ్రీ పాఠశాలలో తోటి విద్యార్థులతో ఆడుకుంటుండగా..ఫీట్స్‌ వచ్చి పడి పోయింది. బాలిక పేరెంట్స్, టీచర్స్ హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారరు.

Similar News

News December 6, 2025

క్రికెటర్ శ్రీచరణి తండ్రికి రూ.5 లక్షల చెక్కు అందజేత

image

కడప క్రికెట్ తేజం నల్లపురెడ్డి శ్రీచరణికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా ప్రకటించిన రూ.5 లక్షల ప్రోత్సాహక చెక్కును శనివారం MLA మాధవి, క్రికెట్ స్టేడియం ఛైర్మన్ శ్రావణ్ రాజ్‌రెడ్డి కలిసి ఆమె తండ్రికి అందజేశారు. మహిళా క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కడపకు గర్వకారణమై నిలిచిన శ్రీచరణిని అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

News December 6, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 షెడ్యూల్

image

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్-2047 ఎల్లుండి ప్రారంభం కానుంది. హైదరాబాద్ శివారులోని ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో ఈ సదస్సు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ నేతలు, దేశంలోని కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు హాజరవనున్నారు. సమ్మిట్ రెండు రోజుల షెడ్యూల్‌ను ఇక్కడ <>క్లిక్ <<>>చేసి చూడొచ్చు.

News December 6, 2025

TU: డిగ్రీ పరీక్షలు..149 మంది గైర్హాజరు

image

తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా కొనసాగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 29 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన ఐదో సెమిస్టర్ రెగ్యులర్, ఆరో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 1,931 మంది విద్యార్థులకు గాను 1,782 మంది విద్యార్థులు హాజరు కాగా 149 మంది గైర్హాజరయ్యారు.