News April 19, 2024

చిత్తూరు: సొంత గూటికి చేరిన రమాదేవి

image

చిత్తూరు జిల్లా తవణంపల్లె(M) ఉత్తర బ్రాహ్మణపల్లెకు చెందిన వైసీపీ సీనియర్ నాయకురాలు రమాదేవి సొంత గూటికి చేరారు. పూతలపట్టు టికెట్టు ఆశించి భంగపడ్డ ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఇటీవలే ప్రకటించారు. శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ ఛైర్‌పర్సన్ శైలజ చరణ్ రెడ్డి, వైసీపీ ఐరాల మండల కన్వీనర్ బుజ్జి రెడ్డి, ZPTC సుచిత్ర రమాదేవితో చర్చలు జరిపారు. దీంతో ఆమె తిరిగి వైసీపీకి మద్దతు పలికారు.

Similar News

News October 9, 2025

చిత్తూరు: రూ. 346 కోట్ల రుణాలు పంపిణీ

image

స్త్రీనిధి ద్వారా రూ.346 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఏపీఎంలు, సీసీలతో జిల్లా ప్రగతిపై ఆమె సమీక్షించారు. ‘ఉన్నతి’ ద్వారా రూ.20 కోట్లు, సామాజిక పెట్టుబడి నిధి ద్వారా రూ.6 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించామని, ఈ అంశాలను ప్రజల్లో తీసుకెళ్లి వారి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు.

News October 8, 2025

పడిపోయిన అరటి ధరలు.. నష్టాల్లో రైతులు

image

అరటి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో SRపురం, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో రైతులు విరివిగా అరటి పంటను సాగు చేశారు. ధరలు లేకపోవడంతో పలువురు రైతులు పంటను తోటలోని వదిలేస్తున్నారు. రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.

News October 8, 2025

చిత్తూరు: రైతులకు విరివిగా రుణాలు

image

ప్రభుత్వ ఆదేశాలతో రబీ సీజన్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని లీడ్ బ్యాంకు మేనేజర్ హరీష్ వివిధ బ్యాంకులను ఆదేశించారు. రబీ సీజన్‌లో 3,479 కోట్ల వరకు రైతులకు రుణాలు ఇస్తామన్నారు. జిల్లాలో 3.20 లక్షలు మంది రైతులు రుణాలు పొందవచ్చని సూచించారు. అనుబంధ రంగాలకు అదనంగా మరో రూ.16.3 కోట్లు రుణాలు మంజూరు చేస్తామన్నారు.