News December 5, 2025

1,445 పాఠశాలలో మెగా పీటీఎం 3.0 విజయవంతం: డీఈవో

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1,445 పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 3.0 కార్యక్రమం విజయవంతం అయిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. విద్యార్ధుల ప్రగతితో పాటు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని తల్లిదండ్రులు, టీచర్లను, విద్యార్థులను ఆయన కోరారు. ఎస్ఎంసీ సభ్యులు-17,974, ప్రజా ప్రతినిధులు-2,111, అధికారులు-1,751, స్థానిక ప్రతినిధులు-2,395 పాల్గొన్నట్లు తెలిపారు.

Similar News

News March 21, 2026

రంజాన్.. కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు

image

రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రార్థనలు ముగిసేవరకు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను టౌన్‌లోకి అనుమతించకుండా తిప్పమ్మకొట్టం వద్ద నుంచి నేషనల్ హైవేపైకి మళ్లిస్తారు. బస్టాండ్ నుంచి బయలుదేరే బస్సులను బళ్లారి చౌరస్తా, బిర్లా జంక్షన్, సీ. క్యాంపు నుంచి నంద్యాల వైపు మళ్ళిస్తున్నట్లు తెలిపారు.

News March 21, 2026

నిర్దేశించిన లక్ష్యానికి రెట్టింపు లక్ష్యం చేరుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ డిస్ట్రిక్ట్ డోమెస్టిక్ ప్రోడక్ట్ లక్ష్యాలను అదిగమించాలని కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో జీడీడీపీపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యమే కాకుండా ఆ లక్ష్యానికి రెట్టింపుగా లక్ష్యం నిర్దేశించుకుని సాధించాలన్నారు.

News March 21, 2026

నిర్దేశించిన లక్ష్యానికి రెట్టింపు లక్ష్యం చేరుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ డిస్ట్రిక్ట్ డోమెస్టిక్ ప్రోడక్ట్ లక్ష్యాలను అదిగమించాలని కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో జీడీడీపీపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యమే కాకుండా ఆ లక్ష్యానికి రెట్టింపుగా లక్ష్యం నిర్దేశించుకుని సాధించాలన్నారు.