News December 6, 2025
నామినేషన్లు ప్రశాంతం: ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం వెల్లడించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా అక్రమంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News December 7, 2025
ఫ్యూచర్ సిటీ విజన్.. ఆర్థిక లక్ష్యాలు ఇవే!

*రాష్ట్ర సుదీర్ఘకాల ఆర్థిక ప్రణాళికనే ఫ్యూచర్ సిటీ
*విజన్-2047 ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం
*దేశంలో మొదటి నెట్-జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ
*FCDA ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలు
ఇన్నోవేషన్, పారిశ్రామిక హబ్లు BFCలో కీలకం. AI, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఫిన్టెక్, ఎలక్ట్రానిక్స్ తయారీతో పాటు వేలాది మంది ఉపాధి. 30K ఎకరాలను నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, Green జోన్లుగా విభజించారు.
News December 7, 2025
ఫ్యూచర్ సిటీ విజన్.. ఆర్థిక లక్ష్యాలు ఇవే!

*రాష్ట్ర సుదీర్ఘకాల ఆర్థిక ప్రణాళికనే ఫ్యూచర్ సిటీ
*విజన్-2047 ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం
*దేశంలో మొదటి నెట్-జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ
*FCDA ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలు
ఇన్నోవేషన్, పారిశ్రామిక హబ్లు BFCలో కీలకం. AI, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఫిన్టెక్, ఎలక్ట్రానిక్స్ తయారీతో పాటు వేలాది మంది ఉపాధి. 30K ఎకరాలను నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, Green జోన్లుగా విభజించారు.
News December 7, 2025
తిరుపతి: వారిపై గతంలోనూ ఆరోపణలు ఉన్నాయా..?

NSUలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అ.ప్రొఫెసర్లు మాజీ VC మురళీధర్ శర్మ హయాంలో విధుల్లో చేరారు. వీరిలో లక్ష్మణ్(మహారాష్ట్ర), శేఖర్ రెడ్డి (AP)కి చెందిన వారు. లక్ష్మణ్పై గతంలో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయట. మరి ఇలాంటి వ్యక్తి ఏమి చేయలేదంటే ఎలా నమ్ముతారన్నది కొందరి వాదన. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులదే.


