News December 6, 2025

ఫోన్‌ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. ఎందుకోసం?

image

ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) వ్యవస్థ నిరంతరం యాక్టివేట్ చేసి ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్ మేకర్లకు ఆదేశాలివ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసుల దర్యాప్తులో ప్రభుత్వ ఏజెన్సీలు లొకేషన్ కోసం సెల్యులార్ టవర్ డేటాపై ఆధారపడుతున్నాయి. కానీ కచ్చితమైన లొకేషన్ గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో A-GPSను తప్పనిసరి చేయాలని టెలికాం సంస్థలు ప్రతిపాదించాయి.

Similar News

News March 21, 2026

నేడు, రేపు వర్షాలు: APSDMA

image

AP: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరం, VZG, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 21, 2026

గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

image

దేశవ్యాప్తంగా పానిక్ బుకింగ్స్ తగ్గాయని కేంద్రం తెలిపింది. అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని చెప్పింది. ‘గ్యాస్ బుకింగ్స్ 89 లక్షల నుంచి 55 లక్షలకు తగ్గాయి. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటల్లో 4 వేల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. కొత్తగా 13,700 PNG కనెక్షన్లు జారీ చేశాం. ప్రజలు PNG, ఎలక్ట్రిక్/ఇండక్షన్ స్టవ్స్‌ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మళ్లాలి’ అని సూచించింది.

News March 21, 2026

8 గంటల ప్రయాణం తర్వాత విమానం యూటర్న్!

image

ఢిల్లీ నుంచి వాంకోవర్‌(కెనడా)కు బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 8Hr ప్రయాణం తర్వాత తిరిగి ఢిల్లీలోనే ల్యాండైంది. కెనడాలో ఆ ఫ్లైట్‌కు పర్మిషన్ లేకపోవడమే ఇందుకు కారణం. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777-300ER విమానాలకు కెనడాలో అనుమతి ఉండగా, 777-200LRను పంపింది. చైనా గగనతలంలోకి వెళ్లాక తెలియడంతో అధికారులు వెనక్కి రప్పించారు. తర్వాత వేరే విమానంలో ప్రయాణికులను పంపారు.