News December 6, 2025
SRCL: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవికుమార్ శనివారం పరిశీలించారు. వేములవాడ అర్బన్ పరిధిలోని చీర్లవంచ, మారుపాక, చింతలతాన, కోనరావుపేట మండలం కొలనూరు, మర్తనపేటలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News December 6, 2025
విశాఖ జైలంతా గంజాయి ఖైదీలే..!

విశాఖ కేంద్ర కారాగారం ఖైదీలతో నిండుతోంది. ఇక్కడ సామర్థ్యం 914 మంది కాగా, ప్రస్తుతం 1,724 మంది ఖైదీలున్నారు. వీరిలో గంజాయి కేసులో శిక్ష పడినవారు, విచారణ ఖైదీలు 1,100 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి రెట్టింపు ఖైదీలు ఉండటంతో పర్యవేక్షణ, వసతుల కల్పన అధికారులకు సవాలుగా మారింది. ఉమ్మడి విశాఖలోని గంజాయి కేసులను ఒకే న్యాయమూర్తి విచారిస్తుండటంతో ఖైదీల సంఖ్య పెరగడానికి కారణమని తెలుస్తోంది.
News December 6, 2025
రకాలను బట్టి గ్రేడ్లు నిర్ణయించాలి: ITDA PO

కాఫీ పండ్ల నాణ్యతను బట్టి స్పష్టమైన గ్రేడ్లను నిర్ణయించాలని సంబంధిత అధికారులను పాడేరు ITDA PO తిరుమణి శ్రీ పూజ ఆదేశించారు. శనివారం చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్ను ఆమె అకస్మికంగా సందర్శించారు. పరిశీలనలో భాగంగా కాఫీ పండ్లు, పార్చ్మెంట్తో పాటు డ్రాయింగ్ యార్డ్స్ను ఆమె పరిశీలించారు. పండ్ల గ్రేడ్కు అనుగుణంగా పార్చ్మెంట్, డ్రాయింగ్ ప్రక్రియను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
News December 6, 2025
కాకినాడ టీడీపీలో ఏం జరుగుతోంది..?

కాకినాడ టీడీపీలో ఏం జరుగుతోందని క్యాడర్ ఆందోళన చెందుతోంది. సిటీ ఎమ్మెల్యే కొండబాబు హవాకు సొంత కూటమిలోనే బ్రేకులు పడుతున్నాయని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తాజాగా కమిషనర్ నియామకంలో ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వర్మను కాదని ఎంపీ సానా సతీశ్, ఎమ్మెల్సీ పద్మశ్రీ చక్రం తిప్పి సత్యనారాయణను తేవడం హాట్ టాపిక్ అయ్యింది. ఎంపీ వర్గం పైచేయి సాధించడంతో.. ఎమ్మెల్యే పరిస్థితి ఏంటని క్యాడర్ గుసగుసలాడుకుంటోంది.


