News December 7, 2025
37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగవ్వాలి: చంద్రబాబు

AP: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ మీటింగ్లతో వారి పనితీరు మెరుగుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరి పనితీరుపైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కేడర్ను సిద్ధం చేసుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు.
Similar News
News March 5, 2026
యుద్ధంపై బెట్టింగ్.. ₹కోట్లు గెలుచుకున్నారు!

US-ఇరాన్ యుద్ధంతో ఓ పక్క ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే కొందరు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం కాసులపంట పండించుకున్నారు. ఇరాన్పై US ఎప్పుడు దాడి చేస్తుందో అంచనా వేసి పాలీమార్కెట్ అనే క్రిప్టో ప్లాట్ఫామ్లో గత శుక్రవారం 150 మంది బెట్ కాశారు. వీరిలో 16 మంది లక్ష డాలర్లు, ఓ వ్యక్తి 5లక్షల డాలర్లు (₹4కోట్లు) సంపాదించారు. అయితే యుద్ధంపైన బెట్టింగ్ ఏంటని పాలీమార్కెట్ సహా యూజర్లపై విమర్శలు వస్తున్నాయి.
News March 5, 2026
విశాఖ భూగర్భంలో రెడీగా మిలియన్ టన్నుల చమురు!

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నేపథ్యంలో మన దేశంలో ముడి చమురు నిల్వల సామర్థ్యం చర్చనీయాంశమైంది. అయితే ఇంధన సంస్థల నిల్వలతో పాటు విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పడూరులో అండర్గ్రౌండ్లో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు భద్రంగా ఉందని తెలుసా? వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ అంటారు. 2015లో ఫేజ్-1 లాంచ్ కాగా మరిన్ని ఏర్పాటుకానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉండేందుకు వీటిని తీసుకొచ్చారు.
News March 5, 2026
ఫైనల్కు ఒక్క అడుగుదూరంలో..

T20WC: నేడు ముంబై వేదికగా భారత్ ఇంగ్లండ్తో సెమీస్లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ సెమీస్లో వరుసగా మూడోసారి ఇంగ్లండ్తో ఆడనుంది. 2022లో ఇంగ్లండ్, 2024లో భారత్ సెమీస్ విజేతలుగా నిలిచాయి. ఇక హెడ్ టు హెడ్లో భారత్దే పైచేయి. T20WC చరిత్రలో ఐదుసార్లు తలపడగా IND మూడుసార్లు గెలిచింది. 2024 మ్యాజిక్ను రిపీట్ చేసి మళ్లీ ఫైనల్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాత్రి.7.00కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.


