News December 7, 2025
తిరుపతి: వారిపై గతంలోనూ ఆరోపణలు ఉన్నాయా..?

NSUలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అ.ప్రొఫెసర్లు మాజీ VC మురళీధర్ శర్మ హయాంలో విధుల్లో చేరారు. వీరిలో లక్ష్మణ్(మహారాష్ట్ర), శేఖర్ రెడ్డి (AP)కి చెందిన వారు. లక్ష్మణ్పై గతంలో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయట. మరి ఇలాంటి వ్యక్తి ఏమి చేయలేదంటే ఎలా నమ్ముతారన్నది కొందరి వాదన. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులదే.
Similar News
News January 13, 2026
సంగారెడ్డి: కళాశాలలకు ప్రయోగశాల నిధులు

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో ప్రయోగశాలల బలోపేతానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో కళాశాలకు రూ. 50,000 చొప్పున కేటాయించినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. ప్రయోగ పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అవసరమైన రసాయనాలు, పరికరాలను ఈ నిధులతో కొనుగోలు చేయాలని ప్రిన్సిపల్లను ఆదేశించారు. దీంతో విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య మరింత చేరువ కానుంది.
News January 13, 2026
వివేకా హత్య కేసులో YS సునీత మరో అప్లికేషన్

వివేకా హత్యకేసులో ఆయన కుమార్తె YS సునీత SCలో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పాక్షికంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆమె సవాలు చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా HYD CBI కోర్టు పాక్షిక విచారణకు ఆదేశించినట్లు అప్లికేషన్లో పేర్కొన్నారు. విచారణను SC వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కాగా CBI విచారణ కొనసాగింపుపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని SC గతంలోనే ట్రయల్ కోర్టును ఆదేశించింది.
News January 13, 2026
మాజీ మంత్రి సతీమణి లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం

దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవిని ఓదార్చారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వివాహాన్ని తానే దగ్గరుండి చేయించానన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని బావోధ్వేగానికి గురయ్యారు.


