News December 7, 2025

జనగామ: గుర్తులు ఖరారు!

image

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు శనివారం ప్రకటించారు. వార్డు మెంబర్, సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో పోటీదారులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

Similar News

News December 8, 2025

భీమవరంలో బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు..!

image

విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం మండలం గొల్లవానితిప్ప ఉన్నత పాఠశాల బాలికలను మ్యాథ్స్ టీచర్ లైంగికంగా వేధించినట్లు తెలియడంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా నిర్వహించిన PTMలో తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. చట్టపరంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

News December 8, 2025

VKB: నిద్రిలో నిఘా వ్యవస్థ.. సరిహద్దులు దాటుతున్న ధాన్యం

image

అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అండతో పంటను దళారులు కొనుగోలు చేసి సరిహద్దులు దాటిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు కుమ్మక్కై ధాన్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిఘా వ్యవస్థ నిద్రపోవడంతో ధాన్యం పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని మండిపడుతున్నారు. రైతుల దగ్గర తక్కువకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు.

News December 8, 2025

చౌటుప్పల్: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

image

కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో జరిగింది. సూర్కంటి కిరణ్ రెడ్డి (25) ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ మన్మథ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.