News April 19, 2024

అధికారులపై ఫిర్యాదులు.. CEC నిర్ణయం కోసం చూస్తున్నాం: ముకేశ్ కుమార్

image

AP: ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సీనియర్ అధికారులపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీ దీనిపై దృష్టి సారించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సలహాదారులకు సైతం ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తేల్చి చెప్పారు.

Similar News

News February 9, 2026

రేపు స్పీకర్‌పై అవిశ్వాస అస్త్రం!

image

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండీ కూటమి సిద్ధమైంది. సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష MPలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నరవణె పుస్తక ప్రస్తావన సమయంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం, ప్రధానిపై దాడికి ప్రయత్నిస్తున్నారంటూ మహిళా MPలపై నిరాధార ఆరోపణలు చేయడం ఈ వివాదానికి ఆజ్యం పోశాయి.

News February 9, 2026

లిప్‌స్టిక్ ఎక్కువగా వాడుతున్నారా?

image

లిప్ స్టిక్ లో ఉండే లెడ్, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం శరీరంలోకి చేరితే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. లిప్‌స్టిక్‌ నిరంతరం ఉపయోగించడం వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి లిప్‌స్టిక్‌ను పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు. కెమికల్స్, పారాబెన్ లేని లిప్‌స్టిక్‌ను మాత్రమే ఎంచుకోండి. లిప్ స్టిక్ వేసుకునే ముందు బేస్ కోసం కన్సీలర్ ఉపయోగించండి. ప్రెగ్నెన్సీలో వాడకపోవడమే మంచిది.

News February 9, 2026

అంబటి రాంబాబుపై 52 కేసులు!

image

AP: వైసీపీ నేత <<19026518>>అంబటి రాంబాబు<<>>పై రాష్ట్రవ్యాప్తంగా 52 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో 3 పీటీ వారెంట్లను అధికారులు సిద్ధం చేశారని సమాచారం. అటు అంబటిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, 8 రోజుల్లో 36 కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపించింది. మరిన్ని పీటీ వారెంట్లు జారీ చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పాలని ప్లాన్ చేస్తోందని విమర్శించింది. CM CBNపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి అరెస్టయ్యారు.