News April 19, 2024

ఏప్రిల్ 23న సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 23న సెలవు ప్రకటించాలని తెలంగాణ విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి అని గుర్తు చేశారు. ఆరోజు గౌలిగూడ శ్రీరామ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు భారీ ర్యాలీ చేస్తామని, ఈ నేపథ్యంలో అధికారికంగా సెలవు ప్రకటించాలని కోరారు.

Similar News

News February 13, 2026

స్కూళ్లను బాగు చేస్తే ప్రమాణాలు ఎందుకు దిగజారాయి: లోకేశ్

image

AP: స్కూళ్లలో సదుపాయాల కోసం ₹7500 CR ఖర్చు చేయాల్సి ఉందని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. ‘18 అంశాల్లో స్కూళ్లకు రేటింగ్ ఇవ్వగా 40% 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి. 84.3% 3వ తరగతి, 62.5% 5వ తరగతి, 47% 8వ తరగతి విద్యార్థులు 2వ క్లాస్ పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. YCP హయాంలో అద్భుతంగా చేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఇంతలా ఎందుకు పడిపోయాయి’ అని ప్రశ్నించారు. వీటిని మెరుగుపరుస్తామని చెప్పారు.

News February 13, 2026

సిరిసిల్లలో BRS విజయం, ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో BRS విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 చోట్ల BRS గెలిచింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డు సొంతం చేసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది.

News February 13, 2026

ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్

image

జోలెపాళ్యం మంగమ్మ 1925 సెప్టెంబర్ 12న మదనపల్లెలో జన్మించారు. ఆలిండియా రేడియో పరీక్షల్లో ఉత్తీర్ణురాలై 1960లో రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్, ఎడిటర్‌గా పనిచేశారు. కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖల్లో కీలకపదవులతో పాటు పరిశోధనలు, పుస్తక రచనలో అనేక అవార్డులు వరించాయి. ఆంధ్రానైటింగేల్ బిరుదు పొందారు. ఈమెకు తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషల్లో ప్రావీణ్యం, బోధనలో అనుభవం ఉంది.