News December 8, 2025

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కథలాపూర్లో 9.9℃, మన్నెగూడెం 10℃, గుల్లకోటలో 10℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ కేంద్రం ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాఘవపేట 10.1, మల్లాపూర్, నేరెళ్ల 10.2, గోవిందారం 10.3, ఐలాపూర్ 10.4, సారంగాపూర్, రాయికల్, మేడిపల్లి 10.5, జగ్గసాగర్ 10.6, పెగడపల్లి, పొలాస, పూడూర్లో 10.7℃గా నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రంగానే ఉంది.

Similar News

News January 13, 2026

దీపికకు రాష్ట్రపతి ఆహ్వానం

image

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు ఆహ్వానం అందింది. అమరాపురం(M) తంబలహట్టిలో దీపికకు ఈ ఆహ్వాన పత్రికను హిందూపురం తపాలా అధికారులు అందజేశారు. రాష్ట్రపతి ఆహ్వానం రావడంతో మండల వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ దీపికను అభినందించారు. ఇది గ్రామానికే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.

News January 13, 2026

ప్రేక్షకులు లేకుండానే WPL మ్యాచ్‌లు!

image

WPLలో భాగంగా జనవరి 14, 15 తేదీల్లో జరిగే మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 15న ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దీంతో DY పాటిల్ స్టేడియంలో జరిగే DC-UPW, MI-UPW మ్యాచ్‌లకు సరిపడా భద్రత కల్పించలేమని పోలీసులు BCCIకి తెలియజేశారు. ఈ తేదీలకు సంబంధించిన టికెట్లను అమ్మకానికి పెట్టలేదు. 16న జరిగే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు సైతం ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

News January 13, 2026

నేటి నుంచి పరేడ్ గ్రౌండ్స్‌లో పతంగుల పండుగ

image

TG: Hyd పరేడ్ గ్రౌండ్స్‌లో ఈరోజు నుంచి 18వ తేదీ వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకల్లో 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అలాగే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. పతంగులతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయి. భద్రత దృష్ట్యా మాంజా దారాన్ని నిషేధించారు. సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.