News December 8, 2025

‘వారణాసి’కి మహేశ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

image

రాజమౌళి ‘వారణాసి’ చిత్రం కోసం మహేశ్ బాబు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారని సినీ వర్గాలు తెలిపాయి. మూవీ పూర్తయ్యేందుకు 3-4 ఏళ్లు పట్టే అవకాశం ఉండటంతో మొత్తం రూ.150-200 కోట్లు తీసుకుంటారని సమాచారం. సాధారణంగా మహేశ్ ఒక్క సినిమాకు రూ.70 కోట్లు తీసుకుంటారని టాక్. కాగా ‘వారణాసి’ 2027 మార్చిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

Similar News

News April 5, 2026

ఉప్పల్‌లో SRHకు అదిరిపోయే రికార్డులు!

image

IPL: హోంగ్రౌండ్ ఉప్పల్‌లో SRH తన పర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఊర్రూతలూగిస్తూనే ఉంటుంది. 2013 నుంచి ఈ గ్రౌండులో ఆ జట్టు 63 మ్యాచులు ఆడగా 38 విజయాలను సొంతం చేసుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 61కి పైనే ఉంది. మరోవైపు లీగ్‌లో ఇప్పటి వరకు నమోదైన రెండో అత్యధిక స్కోర్(286) గత సీజన్లో RRపై చేసింది. 2025లోనే పంజాబ్ జట్టుపై 247 పరుగులనూ ఛేదించింది. ఇక ఉప్పల్‌లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే 57% గెలవడం గమనార్హం.

News April 5, 2026

IPL హీట్: టాలీవుడ్ కలెక్షన్లకు గండి!

image

IPL మ్యాచ్‌లు ఉండటంతో ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆడియెన్స్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘రాకాస’, ‘బైకర్’ వంటి సినిమాలకు మ్యాచ్‌ల సెగ తగులుతోంది. ఏప్రిల్ 10న రాబోతున్న ‘డెకాయిట్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రాలకు కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. మే నెలాఖరు వరకు IPL సందడి కొనసాగనుంది. కంటెంట్ బాగుంటే తప్ప ఈ ‘క్రికెట్ తుఫాను’ను తట్టుకోవడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

News April 5, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు కేజీ రూ.230-రూ.300 మధ్య ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రాంతాలను బట్టి రూ.260 నుంచి రూ.290, వరంగల్‌లో రూ.280, కామారెడ్డి జిల్లాలో రూ.280-రూ.290 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.230, గుంటూరులో రూ.250, విశాఖలో రూ.270, బాపట్లలో రూ.300కు అమ్ముతున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.