News December 8, 2025
కరీంనగర్ డీఈఓగా అదనపు కలెక్టర్

కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాంక్డేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఈ నవీన్ నికోలావీస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఈఓగా ఉన్న శ్రీరామ్ మొండయ్య ఇకపై డైట్ ప్రిన్సిపాల్గా కొనసాగనున్నారు. పలువురు డీఈఓ పదవికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
Similar News
News March 12, 2026
కరీంనగర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

కరీంనగర్(D)లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలన్నారు. సింగిల్ సిలిండర్కు 25 రోజులు, డబుల్కు 15 రోజుల గడువు ఉంటుందని తెలిపారు. గ్యాస్ పొందే సమయంలో ఓటీపీ తప్పనిసరిగా చెప్పాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 11, 2026
KNR: ‘డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్కు దూరంగా ఉండాలి’

డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వేంకటరమణ తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన కరపత్రాన్ని వారు KNRలో ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ తదితరులు ఉన్నారు.
News March 11, 2026
KNR: ప్రజాప్రతినిధులకు ‘ప్రగతి’ పాఠాలు

‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’పై కరీంనగర్ జిల్లా లోని సర్పంచ్, కార్పొరేటర్లకు (రేపు) గురువారం నిర్వహించనున్న శిక్షణను విజయవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. 10 ప్రధానాంశాలతో కూడిన 99 రోజుల కార్యాచరణ, విధివిధానాలు, ఆదాయ వనరుల పెంపుపై స్లైడ్లు, వీడియోలతో ఆకట్టుకునేలా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. జిల్లాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్నారు.


