News April 19, 2024
జూన్ 1న ఎగ్జిట్ పోల్స్
ఎన్నికల పోలింగ్ ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందరిలో ఆసక్తిని కలిగిస్తాయి. తుది ఫలితాలకు ముందు విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్పై భారీగా అంచనాలు ఉండటంతో వీటికి ప్రాధాన్యం పెరిగింది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఇవాళ మొదలైంది. జూన్ 1తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజు సా.6.30 నుంచి ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తాయి. జూన్ 4న తుది ఫలితాలు వెలువడుతాయి.
Similar News
News October 14, 2024
రాడార్ స్టేషన్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR
TG: దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి BRS వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పష్టం చేశారు. CM ఓవైపు మూసీకి మరణశాసనం రాస్తూ, మరోవైపు సుందరీకరణ చేస్తారా అని ప్రశ్నించారు. 10ఏళ్ల పాలనలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని కేటీఆర్ వెల్లడించారు. దీనికి వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.
News October 14, 2024
CATను ఆశ్రయించిన ఐఏఎస్లు
ఏపీ క్యాడర్ ఐఏఎస్లు ఆమ్రపాలి, కరుణ, వాణి ప్రసాద్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT)ను ఆశ్రయించారు. ఏపీకి వెళ్లేందుకు తాము సిద్ధంగా లేమని, TGలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. DOPT ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాట్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈనెల 16లోపు ఏపీలో రిపోర్టు చేయాలని వీరిని డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే.
News October 14, 2024
స్పెషల్ బస్సుల్లోనే ధరలు పెంచాం: సజ్జనార్
బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని TGSRTC ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. 2003లో జీవో- 16 ప్రకారం స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ‘రెగ్యులర్ సర్వీస్ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు 500 స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతోంది. వీటిలో మాత్రమే ఛార్జీలు పెంచాం. మిగతా రోజుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయి’ అని స్పష్టం చేశారు.