News December 8, 2025
మచిలీపట్నం: అనాథ పిల్లలకు అమృత ఆరోగ్య కార్డులు

మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాథ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాథ పిల్లలకు ఆరోగ్య కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి ఆరోగ్య భద్రతపై అవగాహన కూడా కల్పించారు.
Similar News
News March 19, 2026
కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరణ రికార్డు.. రూ. 1,744 కోట్ల చెల్లింపులు!

కృష్ణా జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయినట్లు జాయింట్ కలెక్టర్ నవీన్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 92,639 మంది రైతుల నుంచి మొత్తం 7.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దీని విలువ రూ. 1,744.50 కోట్లుగా ఉంది. రైతు సేవా కేంద్రాల ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిపామని, అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
News March 18, 2026
కృష్ణా: పదో తరగతి హిందీ పరీక్షకు 233 మంది గైర్హాజరు

పదో తరగతి హిందీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది పరీక్షకు హాజరయ్యారు. 233 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. DLO 4, DEO 7, ACGE 5, డిస్ట్రిక్ట్ మోనటరింగ్ కో-ఆర్డినేటర్స్ 5, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 45 కేంద్రాలను తనిఖీ చేశాయి. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 598 మందికి 437 మంది హాజరయ్యారని తెలిపారు.
News March 18, 2026
పామర్రు: ‘పది’ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

పామర్రు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు.


