News December 9, 2025
నల్గొండ: ఇవాళ సాయంత్రం నుంచి అంతా గప్ చుప్

జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రం తెర పడనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. NLG జిల్లాలో 14 మండలాల్లో 318, SRPT జిల్లాలో 159, యాదాద్రి జిల్లాలో 138 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈసారి ఈ ఎలక్షన్స్ను ప్రతిష్ఠాత్మకంగా భావించి తమ మద్దతుదారుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.
Similar News
News December 13, 2025
హెచ్పీవీని జాతీయ టీకాల జాబితాలో చేర్చాలి: విశాఖ సీపీ

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ను జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో చేర్చాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైతన్య స్రవంతి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు, హోంగార్డుల కుమార్తెలకు (9-14 ఏళ్లు) ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆయన శనివారం ప్రారంభించారు. వ్యాక్సిన్పై అవగాహన కల్పించేందుకు త్వరలో బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
News December 13, 2025
నిర్మల్: పోలింగ్ సిబ్బందితో మాటామంతీ

నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి శనివారం పలు సూచనలు చేశారు. స్థానిక మినీ ఎన్టీఆర్ స్టేడియంలో పోలింగ్ సామగ్రి తీసుకొని బస్సుల్లో బయలుదేరుతున్న సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలన్నారు.
News December 13, 2025
మంగళగిరి: సీఎం సభా ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 16న కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సభా ఏర్పాట్లను హోంమంత్రి అనిత.. డీఐజీ ఏసుబాబు, ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేశ్ బాబులతో కలిసి పరిశీలించారు. అభ్యర్థులు వారి కుటుంబాలతో కలిసి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.


