News December 9, 2025

మచ్చలు పడుతున్నాయా?

image

చాలామంది మహిళలు తప్పు సైజు, నాణ్యత తక్కువగా ఉన్న లోదుస్తులను వాడతారు. దీని వల్ల కొన్నిసార్లు చర్మంపై మచ్చలు పడే అవకాశం ఉంది. వీటిని పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు. * స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి మర్దనా చేయాలి. * పాలు, బాదం నూనెలను కలిపి మచ్చలున్న ప్రాంతాల్లో రాయాలి. * పెరుగులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న దగ్గర రాస్తే మార్పు కనిపిస్తుంది.

Similar News

News March 7, 2026

‘సిగ్గుచేటు’.. బెంగాల్ ప్రభుత్వంపై మోదీ ఫైర్

image

బెంగాల్‌లోని TMC ప్రభుత్వంపై PM మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>>ను అవమానించేలా బెంగాల్ యంత్రాంగం వ్యవహరించడం సిగ్గుచేటని, ఇది ప్రజాస్వామ్యానికే విఘాతమని విమర్శించారు. సంతాల్ సంస్కృతిని TMC ప్రభుత్వం చాలా చులకనగా చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రపతి కార్యాలయం రాజకీయాలకు అతీతమని, ఆ పదవికి ఉన్న పవిత్రతను గౌరవించాలని హితవు పలికారు.

News March 7, 2026

నాలుగుసార్లు ప్రధాని.. చిత్తుగా ఓడిపోయారు

image

నేపాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఆ దేశానికి నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ(CPN-UML) సొంత నియోజకవర్గం జాఫా-5లో చిత్తుగా ఓడిపోయారు. ఆయనపై RSP అభ్యర్థి బాలేంద్ర షా 49,164 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఓవరాల్‌గా 165 స్థానాలకుగాను RSP 67 చోట్ల గెలిచింది. 55 సెగ్మెంట్లలో లీడింగ్‌లో ఉంది. మిగతా పార్టీలన్నీ సింగిల్ డిజిట్‌తో పోటీ పడుతున్నాయి.

News March 7, 2026

ఇకపై రైతుల అకౌంట్లకే సబ్సిడీ నిధులు: తుమ్మల

image

TG: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులు కొనుగోలు చేసిన పనిముట్లకు 40% సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తోంది. ఇకపై అన్నదాతల ఖాతాలకే ఆ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. APR నెలాఖరులోగా పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఖరీఫ్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించాలన్నారు. ఈసారి 60.60L హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.