News December 9, 2025
పశ్చిమ ప్రకాశం వాసులకు తీరనున్న ప్రయాణ కష్టాలు

ఏపీ ప్రభుత్వం మార్కాపురం జిల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే యర్రగొండపాలెం (135 km), మార్కాపురం (98 km), కనిగిరి (92 km)కి దూరం ప్రయాణించాల్సి వచ్చేదని పశ్చిమ ప్రకాశం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నూతన మార్కాపురం జిల్లాలో కలిపిన నియోజకవర్గాలకు జిల్లా కేంద్రం 65(km)లోపే ఉంటుంది. గిద్దలూరుకు మాత్రం ఒంగోలుతో పోల్చుకుంటే మార్కాపురం దగ్గరే.
Similar News
News February 2, 2026
దాడులు సమంజసం కాదు: బూచేపల్లి

మాజీ మంత్రి అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆయన ఇంటిపై దాడి చేయడం ఎంత వరకు సమంజసమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలను అదుపు చేయాల్సిన బాధ్యతను టీడీపీ గుర్తించాలన్నారు.
News February 2, 2026
ప్రకాశం జిల్లా అవతరణం జరిగింది నేడే..!

ప్రకాశం జిల్లా నేడు అవతరించిన రోజు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొంత భాగాన్ని వేరుచేసి 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అనంతరం 1972లో జిల్లా వాసి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీదుగా జిల్లాకు ప్రకాశమని నామకరణం చేశారు. అయితే ప్రస్తుతం ప్రకాశం నుంచి విడిపోయిన మార్కాపురం డివిజన్ జిల్లాగా అవతరించింది.
News February 2, 2026
ప్రకాశం జిల్లా అవతరణం జరిగింది నేడే..!

ప్రకాశం జిల్లా నేడు అవతరించిన రోజు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొంత భాగాన్ని వేరుచేసి 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అనంతరం 1972లో జిల్లా వాసి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీదుగా జిల్లాకు ప్రకాశమని నామకరణం చేశారు. అయితే ప్రస్తుతం ప్రకాశం నుంచి విడిపోయిన మార్కాపురం డివిజన్ జిల్లాగా అవతరించింది.


