News December 9, 2025

శ్రీకాకుళం: ‘లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 47 మందిపై కేసులు నమోదు చేశాం’

image

శ్రీకాకుళం జిల్లాలో గడచిన 5 సంవత్సరాల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 47 మందిపై కేసులు నమోదు చేశామని జిల్లా అవినీతి నిరోధక శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ కేసులలో అధికారులు, ఉద్యోగులు ఉండగా వారిలో కొంతమంది జైలుకు వెళ్లగా మరి కొంతమంది కోర్టుల్లో విచారణ ఎదుర్కొంటున్నారన్నారు.

Similar News

News January 18, 2026

రథ సప్తమికి ఆర్ట్స్ కాలేజీ‌లో డ్రోన్ షో

image

అరసవిల్లి సూర్యనారాయణ దేవస్థానంలో రథసప్తమి వేడుకలు పురస్కరించుకుని శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 23వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో జరుగుతుందన్నారు.

News January 18, 2026

రథసప్తమి వేడుకల పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే

image

ఈనెల 19 నుంచి 23వరకు జరగనున్న రథసప్తమి వేడుకల షెడ్యూల్ సంబంధిత అధికారులు ఆదివారం ప్రకటించారు. ఆ మూడు రోజులు హెలిప్యాడ్ రైడింగ్ ఉదయం 9-సాయంత్రం 5 వరకు ఉంటుంది. NTR మున్సిపల్ హైస్కూల్లో వివిధ రకాల క్రీడా పోటీలు జరుగుతాయి. KR స్టేడియంలో ఫుడ్ ఎగ్జిబిషన్ కిడ్స్ ప్లే జరుగుతుందన్నారు. 22న 80 ఫీట్ రోడ్డులో 7 గంటల-మెగాసూర్య నమస్కారాలు, సాయంత్రం 5 గంటల నుంచి భక్తి హాస్యపు జల్లులు 23న శోభా యాత్ర ఉంటుంది.

News January 18, 2026

అరసవల్లిలో VIP పాస్ ఇలా పొందండి..!

image

అరసవల్లి రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా దాతల పాస్‌లు అందుబాటులోకి తెచ్చారు. నేటి నుంచి ఈనెల 23వ తేదీ వరకు ఇస్తామని ఈవో ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. VIP పాస్‌లను రూ.300లకు అందజేస్తామన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికార సిఫార్సు లేఖలతో పాటు ఆర్డీవో ఆఫీసు అదనపు లేఖల ద్వారా VIP పాస్‌లు ఇస్తామని చెప్పారు.