News April 19, 2024

ఎడ్‌సెట్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

image

AP: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌‌కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.1000తో మే 19, రూ.2000తో మే 21 వరకు అప్లై చేసుకోవచ్చు. మే30న హాల్‌టికెట్లు విడుదల చేస్తారు. జూన్ 8న పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/

Similar News

News October 14, 2024

ఎల్లుండి బ్రేక్ దర్శనాలు రద్దు: TTD

image

తిరుమలలో ఈ నెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రాగల 48 గంటల్లో భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ అంచనాలతో భక్తుల భద్రత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 15న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని వెల్లడించింది.

News October 14, 2024

‘INDIA’ కోసం రంగంలోకి సునీల్ క‌నుగోలు

image

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో INDIA కూట‌మి గెలుపు కోసం వ్యూహకర్త సునీల్ క‌నుగోలు రంగంలోకి దిగారు. హ‌రియాణాలో జాట్ల ఓట్ల స‌మీక‌ర‌ణ క్ర‌మంలో మిగతా వ‌ర్గాలు దూర‌మ‌వ్వ‌డం కాంగ్రెస్ కొంపముంచింది. దీంతో MHలో అందరికీ స‌మ ప్రాధాన్యం ఇవ్వడం సహా, అసంతృప్తి నేత‌ల‌ను మ‌చ్చిక చేసుకొనే వ్యూహాలను పార్టీ ముందుంచినట్టు తెలిసింది. హరియాణాలో కాంగ్రెస్ రెబల్స్‌కు BJP సహకరించడం వల్లే ఓడిపోయామని కాంగ్రెస్ భావిస్తోంది.

News October 14, 2024

సంగీతంతో మొక్కలు వేగంగా పెరుగుతాయ్!

image

సంగీతానికి రాళ్లు కరిగించే శక్తి ఉంటుందంటారు. అదే సంగీతం మొక్కలను వేగంగా పెరిగేలా చేస్తుందనే విషయాన్ని పరిశోధకులు నిరూపించారు. మ్యూజిక్ ప్లే చేయడం ద్వారా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే ఫంగస్‌ కార్యాచరణను ప్రేరేపించవచ్చని తేలింది. శిలీంధ్రాలున్న పాత్రల చుట్టూ సౌండ్ బూత్‌లను అమర్చి పరీక్షించారు. 5 రోజుల తర్వాత శిలీంధ్రాలలో పెరుగుదల& బీజాంశం ఉత్పత్తిలో వేగం కనిపించింది.