News December 9, 2025
వాహనదారులారా.. రూల్స్ అతిక్రమించకండి: ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. వాహనదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వేగం, ప్రమాదకర డ్రైవింగ్, మద్యం మత్తు, నిద్రమత్తు డ్రైవింగ్ను పూర్తిగా నివారించాలన్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రోడ్డు సంకేతాలను వాహనదారులు కచ్చితంగా పాటించాలన్నారు. బండి పత్రాలు ఉండాలని, హెల్మెట్/సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడలని, లేనిచో చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు.
Similar News
News April 2, 2026
అనంతపురం ఇక నుంచి 62 డివిజన్లు

50 డివిజన్లకు పరిమితమైన అనంతపురం నగరపాలక సంస్థకు మరో 12 డివిజన్లు అదనంగా పెంచారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62 డివిజన్లుగా మార్పు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కావాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలోని ఆశావాహులకు ఇదో చక్కటి అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.
News April 2, 2026
అమరావతి అజేయం.. లోక్సభలో బిల్లు ఆమోదం చరిత్రాత్మకం: ఎంపీ

AP రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని MP అంబికా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తంచేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రైతుల పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. రాజధానిని ఇక ఎవరూ కదిలించలేరని ఏపీ అభివృద్ధికి ఇది కీలక మలుపు అన్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
News April 2, 2026
అమరావతి అజేయం.. లోక్సభలో బిల్లు ఆమోదం చరిత్రాత్మకం: ఎంపీ

AP రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని MP అంబికా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తంచేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రైతుల పోరాటానికి పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. రాజధానిని ఇక ఎవరూ కదిలించలేరని ఏపీ అభివృద్ధికి ఇది కీలక మలుపు అన్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.


