News December 9, 2025

పౌష్టిక ఆహారంపై యాప్ ద్వారా పర్యవేక్షణ: పీవో

image

ఉమ్మడి జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఐటీడీఏ పల్స్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని ఇన్‌ఛార్జ్ పీవో యువరాజ్ తెలిపారు. విద్యార్థులకు కామన్ డైట్ మెనూ సక్రమంగా అమలు చేయడాన్ని పర్యవేక్షించేందుకు ఈ యాప్ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు యాప్‌ సమర్థంగా వినియోగిస్తూ ఫొటోలు, వివరాలు అప్లోడ్ అవుతున్నాయన్నారు.

Similar News

News January 12, 2026

NLG: సర్కార్ మాటలకే పరిమితం.. కొత్త పథకం ఎక్కడా?

image

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మాటలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతామన్న హామీ కూడా ప్రభుత్వం మరిచిపోయిందని వృద్ధులు మండిపడుతున్నారు. జిల్లాలో వేలాదిమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

News January 12, 2026

స్ఫూర్తిని నింపే స్వామి వివేకానంద మాటలు

image

⋆ లేవండి, మేల్కోండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి
⋆ నీ వెనుక, నీ ముందు ఏముందనేది నీకనవసరం. నీలో ఏముందనేది ముఖ్యం
⋆ రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు
⋆ భయపడకు, ముందుకు సాగు.. బలమే జీవితం, బలహీనతే మరణం
⋆ కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు
☛ నేడు వివేకానంద జయంతి

News January 12, 2026

జనగామ: నొక్కేసిన డబ్బులను రైతులు కట్టాలట!

image

ఇదే విచిత్రం. జనగామ భూ భారతిలో కేటుగాళ్లు నొక్కిసిన ప్రభుత్వ ఖజనాకు రావాల్సిన డబ్బులను రైతులు చెల్లించాలంటూ జనగామ తహశీల్దార్ నోటీసులు ఇవ్వడం వివాదాస్పదమైంది. ప్రభుత్వానికి తక్కువ ఛార్జీ చెల్లించారని, మిగిలిన మొత్తం కట్టాలంటూ ఇద్దరు రైతులకు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి వారు చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్ ద్వారా వచ్చే పత్రంలో ఉన్నా, డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు.