News December 9, 2025
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ను పైన ఫొటోలో చూడవచ్చు. అనుకున్నట్టే CBSE పరీక్షల తరహాలో ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కో పరీక్షకు మధ్య 4-5 రోజుల సమయం ఉంది. విద్యార్థుల ప్రిపరేషన్కు ఇది ఉపయోగపడనుంది.
Similar News
News January 11, 2026
సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలి: హైకోర్టు

AP: సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేలను, పేకాటను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపింది. జంతు హింస నిరోధక చట్టం-1960, జూద నిరోధక చట్టం-1974 అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. కోడి పందేలు, బెట్టింగ్లపై కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అన్ని మండలాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలంది.
News January 11, 2026
215 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ITI)లో 215 పోస్టులకు అప్లైకి దరఖాస్తు గడువును పొడిగించారు. ఉద్యోగాన్ని బట్టి BE/B.Tech, MSc(ఎలక్ట్రానిక్స్/CS/IT), డిప్లొమా, ITI, MBA, MCA, BSc(IT), BCA, BBA, BBM, BMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 16 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 11, 2026
అంతర్జాతీయ ఉద్రిక్తతలు.. భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య భారత రక్షణ బడ్జెట్ 2026పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఈ రంగానికి ₹6.8 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి ఆ నిధులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా సైనిక విస్తరణను అడ్డుకోవడానికి, ఆయుధాల ఆధునికీకరణ, స్వదేశీ తయారీకి ప్రాధాన్యం నేపథ్యంలో పెంపు తప్పదని విశ్లేషిస్తున్నారు. అమెరికా డిఫెన్స్ బడ్జెట్ను ఏకంగా 50% పెంచుతామని ట్రంప్ ప్రకటించారు.


