News April 19, 2024
ఎంపీ RRR తరుఫున సతీమణి, కొడుకు నామినేషన్

ఉండి నియోజకవర్గ MLA అభ్యర్థిగా ఎంపీ రఘురామకృష్ణరాజు తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. RRR సతీమణి రమాదేవి ఉండి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ ఆదిత్యకు ఈరోజు ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, తదితరులు ఉన్నారు. రఘురామకు ఎక్కడి టికెట్ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ వీడకపోవడంతో ఆయన తన సతీమణి, కుమారుడితో నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది.
Similar News
News January 6, 2026
జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్గా సుబ్బారాయుడు

తూ.గో. జిల్లా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్గా బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు నియమితులయ్యారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడైన ఆయన, 2026 నుంచి 2029 వరకు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు రాజా, కార్యదర్శి శ్రీనివాస్ ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.
News January 6, 2026
రెండేళ్ల నిరీక్షణకు ఫలితం.. బాధితురాలి ఖాతాలో పెన్షన్ సొమ్ము జమ!

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జోక్యంతో పి.పద్మావతి అనే బాధితురాలికి న్యాయం చేకూరింది. ఆమెకు రావాల్సిన రూ.11,09,637 పెన్షన్ బకాయిలు ఈనెల 2న బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. అలాగే నెలకు రూ.14 వేల పింఛను మంజూరైంది. 2022లో ఆమె దాఖలు చేసిన అర్జీపై స్పందించి పరిష్కరించినందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంథం సునీత, కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మిలకు పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు.
News January 6, 2026
రాజానగరం: తొలిసారిగా ‘నన్నయ వర్సిటీ’కి ఫైవ్ స్టార్ గౌరవం

ఉన్నత విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్’ సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా నన్నయ వర్సిటీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మంగళవారం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ సర్టిఫికెట్ను వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు.


