News December 10, 2025
ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పౌర సరఫరా సంస్థ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. ధాన్యం అధికంగా కొనుగోలు చేసిన రైతు సేవా కేంద్రం సహాయకునికి, పౌరసరఫరాల ఉపతహశీల్దార్, తహశీల్దార్లకు అవార్డులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్తామన్నారు.
Similar News
News January 14, 2026
WPLలోనే తొలి ప్లేయర్

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన తొలి ప్లేయర్గా గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ ఆయుషి సోనీ రికార్డులకెక్కారు. ముంబైతో మ్యాచులో 11 బంతుల్లో 14 పరుగులు చేసిన ఆమె భారీ షాట్లు ఆడటంలో తడబడ్డారు. దీంతో చేసేదేమీ లేక రిటైర్డ్ ఔట్గా క్రీజును వీడారు. ఆ తర్వాత వచ్చిన ఫుల్మాలి 15 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 36 రన్స్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
News January 14, 2026
జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: మంత్రి పార్థసారధి

జిల్లాలో రైతుల అవసరాలకు మించి యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పార్థసారధి తెలిపారు. మంగళవారం నరసింహారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను సందర్శించి, రైతులు, అధికారులతో మాట్లాడారు. జిల్లాకు 10,073 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 12 వేల టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం రైతులకు అధిక మొత్తంలో ఎరువులు అందజేస్తున్నామని మంత్రి వివరించారు.
News January 14, 2026
ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని పరిశ్రమల శాఖ రాష్ట్ర కార్యదర్శి యువరాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సోమవరప్పాడులో పార్కు కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించి, సమగ్ర నివేదిక పంపాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.


