News December 10, 2025
HYD: CM సాబ్.. జర దేఖోనా!

నేడు CM రేవంత్ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తవించారు. క్యాంపస్కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్లోని మెస్లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News March 17, 2026
గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందవద్దు: జేసీ

శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాస్ కొరతపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 9,800 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఆయిల్ కంపెనీల ద్వారా ప్రతిరోజూ తగినంత నిల్వలు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. గృహ అవసరాల గ్యాస్ సరఫరాపై వచ్చే అపోహలను ఎవరూ నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
News March 17, 2026
నెల్లూరు: ఓ పక్క 10th పబ్లిక్ పరీక్షలు.. మరోపక్క తల్లి మరణం

దుత్తలూరు (M) భైరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అంగన్వాడీ కార్యకర్త దాసరి జయమ్మ గుండెపోటుతో మృతి చెందారు. మృతురాలు కొడుకు రామకృష్ణ వింజమూరు (M) గుండెమడకల జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షలు బాగా రాయాలని తల్లి మాట్లాడిన మాటలు చివరి మాటలు అవుతాయని ఊహించలేదు. పరీక్ష రాసి వచ్చిన తర్వాత తన తల్లి మరణ వార్త విని కన్నీటిపర్యంతమయ్యాడు.
News March 17, 2026
పాకాల: ఉదయాన్నే హైవేపై ప్రమాదం

పాకాల(M) నేండ్ర గుంట సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారెడ్డి ఆవుని తీసుకుని రోడ్డు దాటుచుండగా తిరుపతి వైపు వెళ్తున కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


