News April 19, 2024

ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

image

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రచార రథాలను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సింగపురం ఇందిర ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్న కడియం కావ్యను ప్రజలు భారీ మెజారిటీతో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలన్నారు.

Similar News

News July 7, 2025

వరంగల్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

image

వరంగల్ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. సంగెం 6.8, నెక్కొండ 12.8, నల్లబెల్లి 34.0, వరంగల్ 10.3, గీసుకొండ 6.3, పర్వతగిరి 6.3, వర్ధన్నపేట 11.3, ఖానాపూర్ 18.3, చెన్నారావుపేట 10.0, దుగ్గొండి 41.8, రాయపర్తి 4.0, నర్సంపేట 18.0, మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.

News July 7, 2025

వరంగల్: క్వింటా పసుపు రూ.12,659

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2,400 పలకగా.. పసుపు రూ. 12,659 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.6050 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,850 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News July 7, 2025

వరంగల్: అప్పుల ఊబిలో గ్రామ పంచాయతీలు..!

image

జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. జిల్లాలో 13 మండలాలు ఉండగా ఇందులో 325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏడాదిన్నరకు పైగా గ్రామాల్లో ప్రత్యేక పాలనే నడుస్తోంది. దీంతో కార్యదర్శులు అన్నీ తామై అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో ఒక్కో కార్యదర్శి దాదాపు రూ.2 లక్షలకు పైగా అప్పు చేశామని వాపోతున్నారు.