News December 10, 2025
మన్యం: బాబోయ్ వణుకు..!

పాచిపెంటలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సాయంత్రం 4 దాటిన తరువాత చలి తీవ్రత పెరిగి చలి మంటలు వేసుకుంటూ రక్షణ పొందుతున్నారు. ఉదయం పూట మంచు అధికంగా పడటంతో 7 గంటలు దాటితే గానీ ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది? కామెంట్
Similar News
News April 11, 2026
ADB: కారుణ్య నియామకాల్లో 16 మందికి ఉత్తర్వులు

జిల్లాలో కారుణ్య నియామకాల కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపికైన 16 మంది అభ్యర్థులకు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులను అందజేశారు. 10 రెవెన్యూ , 2 సేల్స్ టాక్స్, 1 వెల్ఫేర్, 1 వైద్య శాఖ, 1 అకౌంట్స్, 1 ఇరిగేషన్ శాఖలకు కేటాయించారు.మొత్తం 15 జూనియర్ అసిస్టెంట్, ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పత్రాలిచ్చారు.
News April 11, 2026
ADB: ఏజెన్సీలో టెనెన్సీ భూముల భారీ స్కామ్..!

ASF, ADB ఏజెన్సీలో టెనెన్సీ భూములపై భారీ స్కామ్ వెలుగుచూసింది. 1954కు ముందు నిజాం కాలంలో భూములు గ్రామ అధికారుల పేర్లపై ఉండేవి. వారు ఆ భూములను రైతులకిచ్చి కౌలు వసూలు చేసేవారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత అప్పటి ప్రభుత్వం రక్షిత కౌలు చట్టం ద్వారా ఆ భూములపై కౌలు రైతులకు హక్కులు కల్పించింది. ప్రస్తుతం అప్పటి గ్రామ అధికారుల వారసులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై దాదాపు 50వేల ఎకరాల్లో స్కామ్కు తెరలేపారు.
News April 11, 2026
అల్లూరి: వాగులో మునిగి యువకుడు మృతి

అల్లూరి జిల్లా చింతూరు మండలం సోకులేరు వాగులో మునిగి ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన కాంతటి రమేష్ శనివారం మృతి చెందాడు. సోకులేరు వ్యూ పాయింట్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. విహార యాత్రకు వచ్చిన ఇతను వాగులో దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్లు చింతూరు సీఐ సీహెచ్ గోపాలకృష్ణ తెలిపారు.


